కేక్ కట్ చేసిన జగన్... తినిపించిన మంత్రులు, అధికారులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసమైన అమరావతిలోని తాడేపల్లిలో గల సీఎం క్యాప్ ఆఫీస్ సందడిగా మారింది. ఏపీ సీఎంగా అఖండ మెజార్టీతో గద్దెనెక్కిన జగన్ అధికారంలోకి వచ్చాక జరుపుకుంటున్న తొలి బర్త్ డే కావడంతో సందడి నెలకొంది. శనివారం ఉదయమే పలువురు మంత్రులు, అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, డీజీపీ గౌతం సవాంగ్ లు జగన్ ఇంటికి వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. […]

Advertisement
Update: 2019-12-21 00:57 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసమైన అమరావతిలోని తాడేపల్లిలో గల సీఎం క్యాప్ ఆఫీస్ సందడిగా మారింది. ఏపీ సీఎంగా అఖండ మెజార్టీతో గద్దెనెక్కిన జగన్ అధికారంలోకి వచ్చాక జరుపుకుంటున్న తొలి బర్త్ డే కావడంతో సందడి నెలకొంది.

శనివారం ఉదయమే పలువురు మంత్రులు, అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, డీజీపీ గౌతం సవాంగ్ లు జగన్ ఇంటికి వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేత కేక్ కట్ చేయించి తినిపించి విషెస్ చెప్పారు.

ఇక జగన్ బర్త్ డే వేడుకల సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, నేతలు కార్యకర్తలు ఫ్లెక్సీలు, కటౌట్లతో హోరెత్తించారు.

శుక్రవారం సాయంత్రం జగన్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా మంత్రులు వచ్చి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News