గ్రూప్‌-2 పేపర్‌-1 పరీక్ష ప్రైమరీ 'కీ' విడుదల

ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25 నుంచి 27 వ తేదీ లోపు తెలుపాలని సర్వీస్ కమిషన్‌ సూచన

Advertisement
Update:2025-02-23 21:49 IST

ఏపీలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పేపర్‌-1 పరీక్షకు సంబంధించి ప్రాథమిక 'కీని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆదివారం విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే psc.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 25 నుంచి 27 వ తేదీ లోపు తెలుపాలని సూచించింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకోగా.. వారిలో 92 శాతం మంది హాజరయ్యారు. 

ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి


Tags:    
Advertisement

Similar News