ఢిల్లీలో చంద్రబాబు దీక్ష.... ప్రియాంక వస్తుందా?

ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న చంద్రబాబు… ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్లమెంట్ సమావేశాల ఆఖరి రోజు ఢిల్లీలో దీక్షకు సిద్దమవుతున్నారు. ఈ దీక్ష కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ సమస్యలకు సరైన పరిష్కారం చూపకపోతే ఆఖరి రోజున దీక్షకు దిగేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు […]

Advertisement
Update: 2019-01-26 05:07 GMT

ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న చంద్రబాబు… ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్లమెంట్ సమావేశాల ఆఖరి రోజు ఢిల్లీలో దీక్షకు సిద్దమవుతున్నారు.

ఈ దీక్ష కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ సమస్యలకు సరైన పరిష్కారం చూపకపోతే ఆఖరి రోజున దీక్షకు దిగేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు చర్చించారు.

ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు వరకు దీక్ష చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. పార్లమెంట్‌ సమావేశాల ఆఖరి రోజు ఢిల్లీలో దీక్ష చేస్తే వివిధ పార్టీల నేతలు కూడా వచ్చి తనకు సంఘీభావం తెలిపే అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు కొత్తగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీని రప్పిస్తే బాగుంటుందని కొందరు ఎంపీలు సూచించారు.

Tags:    
Advertisement

Similar News