పుడింగివా.... ఫోజులొద్దు.... దళిత ఎమ్మెల్యేలపై బాబు ఫైర్

దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని గతంలో వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన చంద్రబాబు.. మరోసారి సొంత పార్టీ దళిత ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ టీడీపీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఊగిపోయారు. కొండేపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పై పరుష పదజాలంతో మండిపడ్డారు. ‘‘నువ్వేం పుడింగివా.. ఎమ్మెల్యేవని విర్రవీగుతున్నావా? ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే కళ్లు నెత్తికెక్కాయా? మహా నాయకుడివని విర్రవీగుతూ ఫోజులు కొడుతున్నావ్‌.. నువ్వేమైనా డిక్టేటర్‌ని అనుకుంటున్నావా?.. […]

Advertisement
Update: 2018-11-03 22:00 GMT

దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని గతంలో వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన చంద్రబాబు.. మరోసారి సొంత పార్టీ దళిత ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ టీడీపీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఊగిపోయారు. కొండేపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పై పరుష పదజాలంతో మండిపడ్డారు.

‘‘నువ్వేం పుడింగివా.. ఎమ్మెల్యేవని విర్రవీగుతున్నావా? ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే కళ్లు నెత్తికెక్కాయా? మహా నాయకుడివని విర్రవీగుతూ ఫోజులు కొడుతున్నావ్‌.. నువ్వేమైనా డిక్టేటర్‌ని అనుకుంటున్నావా?.. నీకు గర్వం పెరిగింది.. గర్వం వచ్చాక మోదీ ఇమేజ్‌ ఎలా పతనమైందో నీ పరిస్థితి అలాగే అవుతుంది. అలా అవకుండా చూసుకో. నేను కళ్లు తెరిస్తే నిన్నెవరూ పట్టించుకోరు. నేను ఒక్క పిలుపిస్తే నీ పరిస్థితి కార్యకర్తకంటే దిగజారుతుంది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీల మాట కూడా వినవా..?’’ అంటూ అందరి ముందే దళిత ఎమ్మెల్యేను దూషించారు చంద్రబాబు.

అందరి సమక్షంలోనే చంద్రబాబు తనను అలా తిట్టడంతో ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి నిర్ఘాంతపోయారు. టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌పైనా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

‘‘నిన్ను జిల్లా నాయకుడిని, ఎమ్మెల్యేని చేశాను. మీ తాతను ఎమ్మెల్యే, మంత్రిని చేశాను. వయసులో పెద్దవాడైనా ఆయన విధేయతగా ఉండేవారు. నీ దగ్గర ఆ అలవాటు లేదు. మీ తాత పనితీరు నీకు రాలేదు. పనితీరు మెరుగు పరుచుకో’’ అంటూ విరుచుకుపడ్డారు.

Tags:    
Advertisement

Similar News