Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    కేసీఆర్ టేబుల్ పై రఘురామ కేసు..

    By SarviJuly 6, 20222 Mins Read
    కేసీఆర్ టేబుల్ పై రఘురామ కేసు..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ పై దాడి కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు, అతని కుమారుడు భరత్ సహా మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

    అయితే ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు.. ముఖ్యంగా సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర.. ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఓ లేఖ రాశారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తనకు రక్షణ ఇవ్వాలని కోరారు రఘురామ.

    వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు, అటు పార్టీకి రాజీనామా చేయకుండా, ఇటు పార్టీ నాయకులనే తిడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆ తిట్లు శృతి మించడంతో.. ఆమధ్య రాజద్రోహం కేసు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా మోదీ భీమవరం సభతో ఆయన తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలనుకున్నారు. అయితే ఆయనకు అధికారిక ఆహ్వానం అందలేదు. భీమవరంలో అడుగు పెడితే తగిన శాస్తి చేస్తామని హెచ్చరికలు రావడంతో ఆయన హైదరాబాద్ లోనే ఆగిపోయారు.

    తన అనుచరులను వైసీపీ నేతలు ఇబ్బంది పెడతారని, అందుకే తాను భీమవరం సభకు రాలేదని చెప్పుకొచ్చారు ర‌ఘురామ‌. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది. హైదరాబాద్ లో రఘురామ కృష్ణంరాజు ఇంటి బయట ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ని కొందరు బలవంతంగా కారులో ఎక్కించుకుని ఆయన ఇంటిలోకి తీసుకుపోవడం, కానిస్టేబుల్ పై దాడి చేయడం, బాధితుడి కంప్లయింట్ ద్వారా హైదరాబాద్ పోలీసులు ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆయన కొడుకు, పీఏపై కేసులు పెట్టడం చకచగా జరిగిపోయాయి.

    ఈ గొడవలో రఘురామకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. అయితే తనపై హత్యాయత్నం చేయాలని చూస్తున్నారని, తనను అంతమొందించాలనుకుంటున్నారని రఘురామ ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు ఈ విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు ఎంపీ.

    ఏపీ ఎంపీ తనకు ప్రాణ హాని ఉందని తెలంగాణ సీఎంకు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా ఉంది. సదరు ఎంపీ హైదరాబాద్ లోనే నివాసం ఉండొచ్చు కానీ.. ఈ మొత్తం వ్యవహారం మాత్రం రాజకీయ కలకలం రేపుతోంది.

    తనపై దాడికి రెక్కీ నిర్వహించిన వారిని తెలంగాణ పోలీసులు వదిలేశారని, వారి మాటలు విని తనపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు ఎంపీ రఘురామ. తెలంగాణ సీఎం కేసీఆర్ ని శరణు కోరారు. మరి కేసీఆర్ ఈ లేఖపై స్పందిస్తారో లేదో చూడాలి. భీమవరం వదిలి రఘురామ వనవాసం ఎన్నాళ్లు కొనసాగుతుంతో వేచి చూడాలి.

    Andhra Pradesh KCR
    Previous Articleఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్ కొత్త ప్రధాని కానున్నారా?
    Next Article కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై కేటీఆర్ సెటైర్లు
    Sarvi

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.