Andhra Pradesh

ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటి వరకు జగనన్న గోరుముద్ద అనే పేరు ఉండేది. దీనికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అనే పేరు పెట్టారు.

పులివర్తికి ఒక్క గాయం కూడా కాలేదని మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయన్నారు. కారుపైన మాత్రమే దాడి జరిగిందన్నారు చెవిరెడ్డి.

నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు సీఎం చంద్రబాబు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలు పెడతామన్నారు.

ఏపీ హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. ‘బొల్లి’ మాటలతో కాలక్షేపం చేయడం వల్ల, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మద్యంపై ఆదాయాన్ని చూపించి అప్పులు చేశారంటున్న విమర్శలకు కూడా బుగ్గన సమాధానమిచ్చారు. ఆ అప్పులతో తామేమీ తప్పులు చేయలేదని, పథకాలు అమలు చేశామని అన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడతారని ఆయనవి డబుల్ స్టాండర్స్డ్ అని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.

శ్వేత పత్రాల్లో విషయమేమీ లేదని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. హామీలు అమలు చేయకుండా తప్పించుకోడానికి టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు.