Andhra Pradesh

చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాన్ లోకల్ పొలిటీషియన్లంటూ గతంలో వైసీపీ నేతలు విమర్శించేవారు. ఇప్పుడు టీడీపీ కూడా అవే ప్రశ్నలు వేస్తోంది. పదే పదే జగన్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారంటోంది.

ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ దాఖలు చేస్తారు. విశాఖపట్నం GVMCలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ZPTCలు, MPTCలు ఓటు హక్కు వినియోగించుకుంటారు.

నిద్రపోతున్న ఆ నలుగురిపై మట్టి మిద్దె పడటంతో ఏం జరిగిందో కూడా అర్థమయ్యేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు కూడా ఎవరూ గుర్తించలేకపోయారు.

ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, మిగతా అందరికీ ఈ రెండు నెలలు ఒకటో తేదీనే జీతాలు బ్యాంకుల్లో జమ అయ్యాయి. టీడీపీ నేతలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారు.

గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఇదే తరహాలో అరెస్టులు చేస్తే విమర్శించి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం నిర్బంధ చర్యలను కొనసాగిస్తోందని లేఖలో మండిపడ్డారు.

దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అని అన్నారు చంద్రబాబు. రామచంద్రరావు కమిటీ వేసి, ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణను తానే తీసుకొచ్చానని గుర్తు చేశారు.

ఉదయం 6 గంటలనుంచే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టారు. మధ్యాహ్నం 11 గంటల సమయానికి 90శాతం పంపిణీ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.