Andhra Pradesh

అప్పులకు వడ్డీలుకట్టడానికే డబ్బుల్లేవంటున్న చంద్రబాబు.. లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు జగన్.

సరిగ్గా నామినేషన్లు ముగిసే కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర కూడా చంద్రబాబుకి ఉంది. ఆ హిస్టరీ ఇప్పుడు రిపీట్ చేస్తారా, లేక పోటీకి దూరంగా ఉంటారా..? వేచి చూడాలి.

తన భార్య, కుమార్తె నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. తన భార్య మరికొందరు తనపై హత్యాయత్నం చేశారని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు శాటిలైట్‌, యూ ట్యూబ్ ఛానల్స్‌ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం లెక్కలేనన్ని యూట్యూబ్‌ ఛానల్స్ పుట్టుకురాగా.. న్యూస్‌ ఛానల్స్‌ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రతి సారీ ఏదో ఒక సమస్య ప్రతిపక్షాన్ని అంతకంటే తీవ్రంగా కార్నర్ చేస్తోంది.

పోనీ ప్రశ్నలతో చికాకు పెట్టేది ఎల్లోమీడియానే అనుకుందాం. సరైన సమాధానం చెప్పి ఆ ఎల్లోమీడియా నోరు మూయించేస్తే అది వైసీపీకి మరింత మైలేజీ తెస్తుంది కదా.

జగన్ ని ఉద్దేశపూర్వకంగానే ఇరుకున పెట్టాలని ఇరువర్గాలు భావించడం ఇక్కడ విశేషం. అటు టీడీపీ, ఇటు షర్మిల ఓ ప్లాన్ ప్రకారమే జగన్ పేరు ప్రస్తావించారని, వైసీపీని విమర్శించారని తెలుస్తోంది.

హత్య చేసిన వారినే కాదు, చేయించిన వారిని కూడా జైలులో పెట్టాలన్నారు జగన్. ఏపీలో జరుగుతున్న రాజకీయ హత్యలకు సంబంధించిన కేసుల్లో చంద్రబాబు, లోకేష్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు.

వైసీపీ సర్కార్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన నాని.. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉన్నారు.