Andhra Pradesh

ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఆ లోపు ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

సోషల్ మీడియాలో అఫిషియల్ హ్యాండిల్స్ లో కూడా వినలేని, చదవలేని పదాలు వచ్చి చేరుతున్నాయి. నిక్కర్ మంత్రీ అని వైసీపీ సెటైర్ వేస్తే, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ మరింత దారుణమైన భాషలో బదులిస్తోంది.

అన్న క్యాంటీన్లను పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు అంబటి. రెండు, మూడు వందల మందికి అన్నం పెట్డి, విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారని చెప్పారు.

పోస్టింగ్‌లు ఇవ్వని ఐపీఎస్‌లు ప్రతి రోజు ఉదయం10 గంటలకు డీజీపీ ఆఫీసుకు రావాలని, అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం పెట్టి ఆఫీసర్స్‌ వెయిటింగ్‌ రూమ్‌లో రోజంతా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

2023 సెప్టెంబర్ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500 కోట్లు వారికి ప్రభుత్వం బకాయిపడింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రూ.160 కోట్లు విడుదల చేసినా.. వారు శాంతించలేదు.

చంద్రబాబులో భయం మొదలైందనడానికి ఇదే సంకేతమని చెప్పారు జగన్. టీడీపీ మెడలు వంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు.

ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ని కలసి టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. దీనిపై ఎస్సీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.