Andhra Pradesh

తాను పార్టీకి విధేయుడినని, నిబద్ధత, నిజాయితీ కలిగిన వైసీపీ కార్యకర్తనని చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్ నాయకత్వంలో తాను అంకిత భావంతో పనిచేస్తానన్నారు.

మోపిదేవి జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన ఓడినా MLC పదవి ఇచ్చి మంత్రిని చేశారని గుర్తుచేశారు. మోపిదేవి పార్టీ వీడతారని తాను అనుకోవడం లేదన్నారు.

2023లో పదవీకాలం ముగియడంతో.. సునీతను మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు జగన్. ప్రస్తుతం 2029 మార్చి వరకు పదవీకాలం ఉంది.

కొత్త నిర్ణయాల కంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే విషయంపైనే కేబినెట్ ఎక్కువగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాత్రం పట్టుబట్టి సీఐతో సారీ చెప్పించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. అస్మిత్ రెడ్డి, సీఐతో సారీ చెప్పించుకోడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణ కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే, ఏపీ నుంచి జగన్ కేవలం 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించడమేంటని నిలదీసింది టీడీపీ.

అర్చకుల జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతోంది.