Andhra Pradesh

ఈ విషయం బయటకు రావడంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వియ్‌ వాంట్ జస్టిస్ అంటూ తెల్లవారుజాము వరకు ఆందోళన‌ కొనసాగించారు.

అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారని, ఆ పార్టీ ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేదని అన్నారు పేర్ని నాని.

ఈరోజు ఆమె విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుని కలుస్తారు. అనంతరం ఈ కేసు విచారణ అధికారి స్రవంతి రాయ్ తో కూడా అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే భార్యకు అధికారిక హోదా లేకపోయినా.. ఆమె బర్త్ డే వేడుకలకు ఎందుకు హాజరయ్యారంటూ పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

మంత్రిగా ఉన్నా కూడా తానెప్పుడూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేయలేదని, కోర్టు కేసుకోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదని, కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని చెప్పారు లోకేష్.

జగన్ ఒంటెత్తు పోకడలు రాజకీయాలకు పనికి రావన్నారు మోపిదేవి వెంకట రమణ. సంక్షేమంపైనే దృష్టిపెట్టి, అభివృద్ధిని పట్టించుకోకపోవడం కూడా వైసీపీ ఓటమికి కారణం అని చెప్పారు.

సెప్టెంబర్-1 ఆదివారం సెలవు కాబట్టి రెండో తేదీ సోమవారం పెన్షన్లు పంపిణీ చేయొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ముందురోజే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. దీనివల్ల రెండు లాభాలున్నాయి.