Andhra Pradesh

జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు, జస్టిస్ నాగార్జునను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. ఇక ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్‌ను బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.

తనను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్యరాజన్‌కు ట్విట్టర్ వేదికగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

నయానో భయానో వైసీపీ నేతల్ని లోబరచుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనేది కేసీఆర్ మాటల సారాంశం. ఇప్పుడు జీవీఎల్ కూడా చేరికలతో బలపడతామని చెబుతున్నారు. అంటే కేసీఆర్ మాటల్ని ఆయన పరోక్షంగా అంగీకరించినట్టే లెక్క.

సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కృష్ణ న‌టించిన‌ పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

శ్రీ‌హ‌రికోట‌లోని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్ర‌యోగం చేయ‌నున్నారు. ప్ర‌స్తుత ప్ర‌యోగం డిమాన్‌స్ట్రేష‌న్ మాత్ర‌మే. ఇందులో మూడు శాటిలైట్ల‌ను పంపిస్తున్నారు.

సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీలో మూడు రోజుల పాటు విచారించినట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్‌లోని 12 కంపెనీలతో పాటు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకూ డైరెక్టర్‌గా ఉన్నారు.

పవన్‌ కల్యాణ్ నివాసం వద్ద రెక్కీ జరిగిందంటూ టీడీపీ, జనసేన చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు హైదరాబాద్ పోలీసులు. రెక్కీ లేదు, కుట్ర లేదు కేవలం తప్పతాగి చేసిన న్యూసెన్స్‌గా స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై ఈ నెల 30 నుంచి సర్వే చేపట్టబోతున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది.

మంత్రి కేటీఆర్ మాత్రం ముందు అభివృద్ధి, తర్వాతే రాజకీయాలంటున్నారు. అందుకే ఆయన హైదరాబాద్ కి ఏయే కంపెనీలు వస్తున్నాయి, ఎంత పెట్టుబడి వస్తోంది, ఎంతమందికి ఉపాధి కలుగుతోంది.. అనే అంశాలపై ఫోకస్ పెట్టారు.

కర్నాటక, మహారాష్ట్ర, యూపీ లాంటి రాష్ట్రాల్లోనే విస్తరిస్తున్నప్పుడు తెలుగువాళ్లు ఉంటే ఏపీలో ఎందుకు విస్తరించకుండా ఉంటామని తెలంగాణ‌ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.