Andhra Pradesh
మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసిన వాళ్ళందరికీ సీఐడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలని సమయం, తేదీ, ప్లేస్తో సహా నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది. అయితే తమ ఖాతాదారులకు సీఐడీ నోటీసులు ఇవ్వటాన్ని ఛైర్మన్ రామోజీరావు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళందరు విచారణకు హాజరైతే అసలు విషయాలు బయటపడతాయి. కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళ ఆర్థిక నేపథ్యం ద్వారా మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది.
కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120కి పైగా ధర పలుకుతోంది.
ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కుంటున్నారని’ చంద్రబాబు చెప్తున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. సరైన నాయకత్వం ఉంటే మంచి అభివృద్ధి జరుగుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
మార్గదర్శికి చెందిన రూ.242 కోట్ల పెట్టుబడులను గురువారం జప్తు చేసింది. ప్రజల నుండి డిపాజిట్లు సేకరిస్తున్న మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ, కోడలు శైలజ తమిష్టం వచ్చినట్లుగా చిట్టేతర సంస్థలకు దారి మళ్ళిస్తున్నట్లు సీఐడీ ఆధారాలతో సహా బయటపెట్టింది.
డీఆర్ఐ అధికారులను తమతో పాటు లోపలకు తీసుకెళ్ళటానికి సీఐడీ అధికారులు మార్గదర్శి సిబ్బందితో పెద్ద వాగ్వాదమే చేయాల్సి వచ్చింది. సీఐడీ ఎంత చెప్పినా మార్గదర్శి సిబ్బంది డీఆర్ఐని లోపలకు అనుమతించలేదు.
అప్రూవర్గా మారిన శరత్తో కల్వకుంట్ల కవిత పేరు చెప్పించేందుకు జగన్ రెడీ అయ్యారనేది రెబల్ ఎంపీ చెబుతున్నారు. కవితను ఇరికించి రహస్య సాక్షిని బయటపెట్టకుండా కాపాడుకునేందుకు కేసీఆర్కు జగన్ ద్రోహం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని రఘురామరాజు చెప్పారు.
టెండర్లలో పాల్గొని లెస్ వేసి మేఘా పనులను దక్కించుకోవటంలో తప్పేమిటో అర్థంకావటంలేదు. పోలవరం కాంట్రాక్టు పనులలో నవయుగను కూడా టెండర్ల వేయమంటే అప్పట్లో వేయనేలేదు. దాంతో మిగిలిన కంపెనీలతో పోల్చితే మేఘా టెండర్ తక్కువకే కోట్ చేసింది. అందుకనే ప్రభుత్వం కాంట్రాక్టులను అప్పగించింది.
క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే థాయ్లాండ్లోని పట్టాయాలో పెద్ద గ్యాంగ్తోనే దొరికాడు. ఒక స్టార్ హోటల్లో తన మనుషులతో జూదమాడిస్తుంటే పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు.
ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో నాగబాబు సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.