Andhra Pradesh

కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో పాటు అతని ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ప్రిన్సిపల్‌ రాజేశ్‌బాబు, గణిత అధ్యాపకుడు కలసి శనివారం మందలించారు.

ఏపీలో బాబు, జగన్, పవన్ తో కూడిన బీజేపీ అధికారంలో ఉందని, ప్రధాన ప్రతిపక్షం లేదని.. షర్మిల మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. 2029లో ఏపీకి షర్మిల ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

చంద్రబాబుతో భేటీలో ఈ అంశాన్ని చర్చకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు కూడా ఆయన సిగ్నల్స్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.

కాపు రిజర్వేషన్లు అనే అంశాన్ని కూటమి తన మేనిఫెస్టోలో పెట్టలేదు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేస్తారో లేదో తెలియని సందర్భంలో రిజర్వేషన్లంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేయడం విశేషం.

వైఎస్ఆర్ గురించి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నానని, వైఎస్ఆర్ ఆనాడు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర పూర్తి చేశానన్నారు రాహుల్ గాంధీ.

చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం ఇస్తామని చెప్పినా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ పద్ధతి అది కాదన్నారు సజ్జల.