పేదల ఇండ్లే కాదు పెద్దలవి కూడా కూల్చినప్పుడే ..
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం;
Advertisement
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇండ్లే కాకుండా పెద్దలవి కూడా కూల్చినప్పుడే ప్రభుత్వ భూములను రక్షించినట్లు అవుతుందని పేర్కొన్నది. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్లు యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం.. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలిగించడం లేదని హైడ్రాను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినా చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలిపింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
Advertisement