తెలంగాణ వారధులు, నిర్మాతలు టీచర్లే

ఎల్బీ స్టేడియం వేదికగా డీఎస్సీ2024 రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందించిన సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement
Update:2024-10-09 23:56 IST

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులంతా భవిష్యత్తు తరాలకు నిర్మాతలుగా అంకితభావంతో పని చేయాలని కోరారు. టీచర్లే తెలంగాణ వారధులు, నిర్మాతలని.. పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత వారిదేని సీఎం అన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా డీఎస్సీ2024 రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..డీఎస్సీ విజేతలను చూస్తే దసరా ముందే వచ్చినట్లు అనిపిస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమమంటూ.. ఈ సందర్భంగా సీఎం ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ పాఠాశాల ప్రాధాన్యాన్ని గుర్తించే ఇచ్చిన మాట ప్రకారం మీ కుటుంబాల్లో దసరా పండుగ సంతోషాలు నింపాలని నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోగా నియామకాలు పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ రంగంలోని 30 వేల పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేటు రంగంలో 10 వేల పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటేనే నమోషీగా భావిస్తున్న పరిస్థితిపై అందరూ ఆలోచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివామని గర్వంగా చెప్పుకునేలా ప్రైవేటు సంస్థలతో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.

మొదటి దశలో 5 వేల కోట్లు వెచ్చించి, 25 నియోజకవర్గాల్లో సకల వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌కు ఈనెల 11న శంకుస్థాపన చేయబోతున్నాం.నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారి సారథ్యంలోని విద్యా కమిషన్ చేసే సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించిన బదిలీలు, ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాం. ఎక్కడా చిన్న వివాదం లేకుండా 34 వేల మంది టీచర్లకు బదిలీలు చేయడంతో పాటు 21 వేల మందికి ప్రమోషన్లు కల్పించాం. తెలంగాణ భావితరాలను అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత యువతరం టీచర్లదే. ఆ టీచర్లకు కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. యువత మాదకద్రవ్యాలకు, వ్యసనాలకు బానిసలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.


Tags:    
Advertisement

Similar News