రాజాసింగ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు బ్లాక్
హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తున్నదని ఎక్స్ వేదికగా రాజాసింగ్ ధ్వజం
Advertisement
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు చెందిన 2 ఫేస్బుక్, 3 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలిగించారు. దీనిపై రాజాసింగ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తున్నది. గురువారం నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారరుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయడం దురదృష్టకరం. అంతకుముందు రాహుల్గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా నా అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగిందని అన్నారు.
Advertisement