లాభాల బోనస్ అంతా బోగస్: కేటీఆర్‌

పండుగ వేళ రేవంత్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పొట్ట కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్‌

Advertisement
Update:2024-09-22 14:02 IST

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా బోనస్ కాదు అది బోగస్ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పండుగ వేళ..ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బోనస్ అంతా బోగస్.. ప్రతి సింగరేణి కార్మికుడికి కనీసం లక్షా 80వేలు లాస్ అన్నారు. నికర లాభం రూ. 4701 కోట్లలో..న్యాయంగా 33 శాతం వాటా రూ. 1551 కోట్ల కావాలి…ప్రతి కార్మికుడికి మూడు లక్షల డెబ్బైవేల రూపాయలు రావాలి.కానీ రూ. 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఇస్తే మొత్తంగా లాభాలలో వాటా ఇవ్వాలి. లేకపోతే మేమూ ఇచ్చేది 16.9 శాతంమాత్రమే అని ఒప్పుకోవాలి. కానీ 33 శాతం అంటూ సింగరేణి కార్మి కుల లాభాల వాటా పైన అసత్యాలు చెప్పవద్దన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మొత్తం పది సంవత్సరాల్లో కార్మి కులకు లాభాల వాటా రూపంలో దక్కింది కేవలం రూ. 365 కోట్ల రూపాయలే. కానీ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో లాభాల వాటా రూపంలో సింగరేణి కార్మి కులకు అందించింది రూ. 2780 కోట్ల రూపాయలు అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించింది.ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సంస్థ లాభాలు పది, పదిహేను శాతానికి మించి ఏనాడు ఇవ్వలేదన్నారు.మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా లాభాలను పెరిగేలా సంస్థ పనితీరును పెంచామని చెప్పారు. ఒక్కొక్క కార్మికుడికి కార్మికులకు అత్యధికంగా 32 శాతం వాటా ఇచ్చాం. మేము అధికారంలో వచ్చే నాటికి రూ. 17వేల రూపాయల లాభాల వాటా ఉంటే అధికారంలోకి దిగిపోయినాటికి లక్ష డెబ్బైవేల రూపాయల వరకు ప్రతి కార్మికుడికి లాభాల వాటా ఇచ్చామని గుర్తుచేశారు. సింగరేణి ప్రాంతంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానమా ఇది అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించినందుకు కార్మికులకు పోట్టగొట్టడమా చేసేది అని నిలదీశారు.

ప్రస్తుతం కార్మికుల హక్కులకు పూర్తిగా భంగం కలిగించేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కార్మికలోకానికి ముందే మేము హెచ్చరించాం. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణి ప్రైవేటీకరిస్తుందని ముందే హెచ్చరించాం .ఆమేరకే రెండు పార్టీలు కలిసి సింగరేణి గనుల వేలాన్ని నిర్వహించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేలంలో నవ్వుతూ పాల్గొన్నారు.లాభాల్లో కార్మికుల వాటా తగ్గించడమంటే, భవిష్యత్తుతో సింగరేణి కార్మికుల ఆత్మస్థైర్యాన్ని, భాగస్వామ్యాన్ని తగ్గించి సింగరేణి ప్రైవేటీకరించే కుట్రగానే భావిస్తున్నామన్నారు.సింగరేణి లాభాల వాటాపైన సింగరేణి కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకురావాలి. సింగరేణి ప్రాంతంలో గెలిసిన 13 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి దగ్గరికి పంపించండి. సింగరేణి ప్రాంత మంత్రులు ఎమ్మెల్యేలు ఈ అంశంలో స్పందించి న్యాయం చేయాలి. సింగరేణి అధికార గుర్తింపు సంఘంతో పాటు, కూనంనేని సాంబశివరావు, బీజేపీ నేతల కూడా ఈ అంశంలో స్పందించాలన్నారు.మా సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా ఈ అంశంలో పోరాటం చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News