టాలీవుడ్ నటులపై మంత్రి పొన్నం ఆగ్రహం

తెలుగు నటులపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖతన కామెంట్స్ వెనక్కి తీసుకున్నాక కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొందరు ప్రముఖులు స్పందించడం కరెక్ట్ కాదని అన్నారు.

Advertisement
Update:2024-10-05 18:30 IST

టాలీవుడ్ నటులపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన నటి సమంత విషయంలో ఇంకా ఎందుకు చర్చ పెడుతున్నారు. కొండా సురేఖపై ట్రోలింగ్ జరిగినప్పుడు కూడా టాలీవుడ్ ఇలాగే స్పందించాల్సింది. బీసీ మహిళ ఒంటరి అనుకోవద్దు. ఆమెకు మేం అండగా ఉంటామని పొన్నం అన్నారు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొందరు ప్రముఖులు స్పందించడం కరెక్ట్ కాదని అన్నారు. ఎవరైనా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారు అంటే.. అక్కడితో ఇక ఆ సమస్య ముగిసినట్లే అని వెల్లడించారు.

రాష్ట్రంలో పది నెలల పాలన సక్సెస్‌పై శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటే అని ఆరోపించారు. ప్రభుత్వంపై కుట్ర పూరితంగా ఒకరి తర్వాత ఒకరు విమర్శలు, ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం మొన్న బీజేపీ ఆందోళన చేస్తే.. ఇవాళ బీఆర్ఎస్ ఆందోళన చేస్తోందని ఎద్దేవా చేశారు. వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం జరిగితే.. కేంద్రం రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News