మైసిగండి అమ్మవారికి కేటీఆర్ పూజలు
కల్వకుర్తి పర్యటనలో భాగంగా మొక్కులు
Advertisement
కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి అమ్మవారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆమనగల్ లో నిర్వహిస్తున్న రైతు దీక్షకు వెళ్తోన్న సందర్భంలో పార్టీ నాయకులతో కలిసి మైసిగండి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Advertisement