మద్యం మాఫియాను చంద్రబాబు నడుపుతున్నారు : వైఎస్ ​జగన్

ఏపీ చంద్రబాబు మద్యంలోనూ మాఫియాను నడుపుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో జగన్ మాట్లాడారు

Advertisement
Update:2024-10-18 15:30 IST

ఏపీ చంద్రబాబు మద్యంలోనూ మాఫియాను నడుపుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో జగన్ మాట్లాడారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ కనీసం బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టలేకపోయిందని, ఓటాన్‌ అకౌంట్‌తో ఇన్నాళ్లు నడిచే ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు గడుస్తున్నా సూపర్‌ 6 లేదు, సూపర్‌ 7 లేదని దుయ్యబట్టారు.

ప్రజల నిలదీస్తారని భయంతో కనీసం రాష్ట్రంలో బడ్జెట్‌ పెట్టలేని చేతాగాని సీఎం చంద్రబాబు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. ఇసుక తీసే కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులకే కట్టబెట్టారని అన్నారు. రెండు రోజులు మాత్రమే టెండర్​కు సమయం ఇచ్చారని తెలిపారు. అందరూ పండగ బిజీలో ఉంటే దోచేసే చేపట్టారని జగన్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News