భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌: వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం

మొదటిరోజు మొదటి సెషన్‌ ఆట సాధ్యపడటం దాదాపు కష్టమేనని విశ్లేషకుల అంచనా

Advertisement
Update:2024-10-16 11:05 IST

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మొదటి టెస్ట్‌ వర్షం కారణంగా ఆలస్యమౌతున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై కన్నేసిన భారత్‌.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానున్నది. ఇదే వేదికపై 12 ఏళ్ల తర్వాత ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌ల్లో 36 ఏళ్లుగా న్యూజిలాండ్‌ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై ఆసక్తి నెలకొన్నది. 

వర్షం పడుతుండటంతో టాస్‌ వేయడం సాధ్యం కాలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు వాన ఆగినా గ్రౌండ్‌ను సిద్ధం చేయడానికి అరగంట నుంచి గంట పడుతుంది. ఆ తర్వాతే టాస్‌ వేస్తారు. టాస్‌ అనంతరం ఆట మొదలు కావడానికి కనీసం 15 నుంచి 30 నిమిషాల సమయం పట్టనున్నది. దీంతో మొదటిరోజు మొదటి సెషన్‌ ఆట సాధ్యపడటం దాదాపు కష్టమేనని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News