టాస్ ఓడిన భారత్..న్యూజిలాండ్ బ్యాటింగ్

ఐసీసీ మహిళ టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్ మహిళ జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Advertisement
Update:2024-10-04 19:39 IST

ఐసీసీ మహిళ టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్ మహిళ జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్‌-Aలో భాగంగా టీమిండియా శుక్రవారం న్యూజిలాండ్‌ జట్టుతో తలపడబోతోంది. ఎలాగైనా శాయశక్తులు ఒడ్డి అత్యుత్తమ ప్రదర్శన చేసి ఫైనల్ చేరాలని భారత జట్టు కలలు కంటోంది. అన్ని విభాగాల్లో భారత్ పటిష్టంగా కనిపిస్తున్నా.. గెలివాల్సిన మ్యాచ్‌ల్లో మాత్రం చేతులెత్తేస్తోంది. అన్ని విభాగాల్లో భారత్ బలంగా ఉన్న.. గెలివాల్సిన మ్యాచ్‌ల్లో మాత్రం చేతులెత్తేస్తోంది.కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, జెమీమా, షఫాలీ, దీప్తిశర్మ బ్యాటింగ్‌లో ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. పూజా వస్త్రాకర్‌, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్‌‌లలో ఇద్దరు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.

భారత జట్టు

హర్మన్‌ప్రీత్‌ (C), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, దీప్తిశర్మ, జెమీమా, రిచా (WK), యాస్తిక, వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్‌, హేమలత, ఆశ, రాధా యాదవ్‌, శ్రేయాంక, సజన.

న్యూజిలాండ్ జట్టు

సోఫీ డివైన్‌ (C), సుజీ బేట్స్‌, అమీలియా కెర్‌, కార్సన్‌, ఇసబెల్లా గేజ్‌ (WK), లియా తహుహు, మ్యాడీ గ్రీన్‌, బ్రూక్‌ హాలీడే, ఫ్రాన్‌ జొనాస్‌, లీ కాస్పెరెక్‌, జాస్‌ కెర్‌, రోస్‌మేరీ, మోలీ పెన్‌ఫోల్డ్‌, జార్జియా ప్లిమెర్‌, హనా.

Tags:    
Advertisement

Similar News