బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా
ముకుల్ రోహత్గీ విజ్ఞప్తితో తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ముందు విచారణ జరిగింది. తగిన సమయం అంటే ఏమిటి అని మరోసారి ప్రశ్నించింది.అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పీకర్ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని రోహత్గీ కోర్టును కోరారు. స్పీకర్తో చర్చించి వివరాలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని.. ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్నించింది. తమకు వాదనలు వినిపించడానికి రెండుమూడు రోజుల సమయం కావాలని కోరారు.తగిన సమయంపై తమకు క్లారిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిది. ముకుల్ రోహత్గీ విజ్ఞప్తితో తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. కేటీఆర్ తన పిటిషన్లో తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేల పోచారం శ్రీనివాస్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి. ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్రెడ్డి, ఎం. సంజయ్కుమార్లను ప్రతిపాదులుగా చేర్చారు. జస్టిస్ గవాయ్ ధర్మాసనం నేడు ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది.