బంగాళాఖాతంలో భూకంపం
రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.1 గా నమోదు
Advertisement
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.1 గా నమోదైంది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.ఉదయం 6.10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ వెల్లడించింది.దీంతో భూకంప తీవ్రతతో కోల్కతా, ఇతర ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి.
Advertisement