పీఎం కిసాన్ నిధులు విడుదల
పీఎం కిసాన్ నిధులు ఇవాళ బీహార్లో భాగల్పూర్ లో ప్రధాని మోదీ విడుదల చేశారు.
Advertisement
దేశంలో అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 19వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. బీహార్లోభాగల్పూర్ లో జరుగనున్న ఒ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఆ కార్యక్రమంలోనే 19వ విడత రైతులకు రూ.22 వేల కోట్ల పీఎం కిసాన్ నిధుల విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రూ.2 వేలు చొప్పున 3 దఫాలుగా రూ.6 వేలు ఒక్కో రైతుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. 2019లో ప్రారంభం అయిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది. అన్నదాత సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. అనంతరం పలు సంక్షేమ పధకాలను మోదీ ప్రారంభించారు.
Advertisement