16 మంది పిల్లల్ని కనాలి.. సీఎం షాకింగ్ కామెంట్స్

కొత్తగా వివాహం చేసుకునే జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు.

Advertisement
Update:2024-10-21 16:52 IST

నూతనంగా పెళ్లి చేసుకునే జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి 16 రకాల సంపదలకు 16 మంది పిల్లలను కనాల్సిన టైమ్ వచ్చిందని అన్నారు. తమిళనాడులో హిందూ మత, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. సీఎం స్టాలిన్ సమక్షంలో 31 జంటలకు వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. మీకు 16 కలిగి సుభిక్షంగా జీవించాలని పెద్దలు కోరుకునేవారు.

అంటే 16 మంది పిల్లలు కాదు, 16 రకాల సంపదలను సూచిస్తుంది. వీటిని ‘ఆవు, ఇల్లు, భార్య, పిల్లలు, విద్య, జిజ్ఞాస, జ్ఞానం, క్రమశిక్షణ, భూమి, నీరు, వయస్సు, వాహనం, బంగారం, ఆస్తి, పంట, ప్రశంసలు’ అని రచయిత విశ్వనాథన్ తన పుస్తకంలో పేర్కొన్నారు’ అని తెలిపారు. మరోవైపు పెళ్లైన కొత్త జంటలను 16 రకాల సంపదలు పొందాలని ఇప్పుడు ఎవరూ ఆశీర్వదించడం లేదని స్టాలిన్‌ అన్నారు. తగినంత సంతానం కలిగి సుఖంగా జీవించాలని మాత్రమే అనుగ్రహిస్తారని చెప్పారు. అయితే లోక్ సభ నియోజక వర్గాలను తగ్గించే అవకాశం ఉన్నదని తెలిపారు. ‘మీరు ఆశ్చర్యపోయేలా 16 మంది పిల్లలను మనం కలిగి ఉండాలన్న పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ విషయాన్ని మరచిపోవద్దు’ అని సీఎం అన్నారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. జనాభా సమతుల్యతపై వృద్ధాప్య జనాభా ప్రభావంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభ తగ్గుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలుని కనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News