నగ్న వీడియోల కేసులో నార్సింగి పోలీసుల దర్యాప్తు

నిందితుడు మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్న పోలీసులు

Advertisement
Update:2025-02-06 11:27 IST

నగ్న వీడియోల కేసులో నిందితుడు మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకోవాలని నార్సింగి పోలీసులు భావిస్తున్నారు. బైటికి వచ్చిన డ్రగ్‌ పార్టీ వీడియోలపైనా ఆరాతీస్తున్నారు. ఈ వీడియోల్లో ఉన్నవారికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. వీడియోలు ఉన్న హార్డ్‌ డిస్క్‌ను లావణ్య ఇప్పటికే పోలీసులకు అందజేసిన విషయం విదితమే. ఆమె సమర్పించిన హార్డ్‌ డిస్క్‌ను పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు.

డ్రగ్స్‌ కేసులో తనను ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని లావణ్య పోలీసులకు ఆడియో ఆధారాలతో ఫిర్యాదు చేశారు.140 గ్రాముల డ్రగ్స్ తన ఇంట్లో పెట్టి ఇరికించేందుకు చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్ సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్‌ కేసుల్లో మస్తాన్‌సాయి నిందితుడు. మస్తాన్ సాయి సుమారు 100 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు అభ్యంతరకర వీడియోలతో మహిళలను బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News