శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు

టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం.. ఆయనపై వేటు వేసిన ఆలయ ఈవో;

Advertisement
Update:2025-03-11 10:29 IST

చెన్నైలో టీటీడీకి చెందిన శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు జరిగాయి. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం ప్రదర్శించారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించారు. ఆ కరెన్సీ లెక్కింపులో తేడా ఉన్నట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌ విభాగం.. సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకుమార్‌ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా కృష్ణకుమార్‌ను ఈవో సస్పెండ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Tags:    
Advertisement

Similar News