ఆ విషయంలో నన్నే ఎందుకు టార్గెట్ చేశారు : నటి ప్రియమణి

వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని బాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement
Update:2024-10-05 20:51 IST

ముస్లిం వ్యక్తిని ఎలా వివాహం చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని బాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికీ ఆట్రోల్స్ ఆగడం లేదని ప్రియమణి వాపోయారు. 2016లో ‘ముస్తాఫా రాజ్‌‌తో ఎంగజ్మెంట్ జరిగినప్పుడు నుండి అనేక వేధింపులు ఎదుర్కొంటున్నాను. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తప్పుడబుతూ పలువురు నన్ను ట్రోల్స్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేను విమర్శలు పట్టించుకోనప్పటికీ.. ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తోంది. కులమతాలకతీతంగా మ్యారేజ్ చేసుకున్న స్టార్లు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు.

కానీ, ఈ విషయంలో నన్ను ఎందుకు టార్గెట్ చేశారని తన బాధను వెలిబుచ్చారు. ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించిన విషయం. ఆర్థికస్థిరత్వం, ప్రాంతం, భాష ఇలాంటి వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు’ అంటూ చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తు ప్రియమణి దూసుకుపోతుంది. ‘జవాన్, మైదాన్, ఆర్టికల్ 370, భామాకలాపం 2’ వంటి చిత్రల్లో నటించి మెప్పించింది. 2022లో రిలీజైన ‘భామాకలాపం’కు సీక్వెల్‌గా వచ్చిన ‘భామ కలాపం 2’ ఈ ఏడాది ఫిబ్రవరి 16 న వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తన ప్రేమ, పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసింది.

Tags:    
Advertisement

Similar News