Trinadharao Nakkina | నిర్మాతగా రెండో సినిమా మొదలు

Trinadharao Nakkina - రీసెంట్ గా నిర్మాణ సంస్థ స్థాపించాడు త్రినాధరావు నక్కిన. ఆ బ్యానర్ పై అప్పుడే రెండో సినిమా స్టార్ట్ చేశాడు.

Advertisement
Update: 2024-04-03 16:58 GMT

డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్స్ తీయడంలో దిట్ట, తన గత చిత్రం 'ధమాకా'తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందించిన ఆయన తన బ్యానర్ నక్కిన నేరేటివ్స్‌లో సినిమాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ సినిమా ప్రకటించిన నక్కిన, ఇప్పుడు తన బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 2ను అనౌన్స్ చేశారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా నటిస్తుండగా, వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.

బ్లాక్‌బస్టర్ సినిమా చూపిస్తా మావ తర్వాత త్రినాధరావు నక్కిన మరో అద్భుతమైన కథను రాశారు. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన విక్రమ్ సహిదేవ్ లగడపాటి ఈల్రెడీ హీరోగా మారాడు. ఇప్పుడు త్రినాధరావు నక్కిన నిర్మాతగా సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. ముహూర్తం షాట్ కు సందీప్ కిషన్ క్లాప్‌ కొట్టగా, శరత్ మరార్ కెమెరా స్విచాన్ చేశారు. సుమంత్ తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించాడు.

దృశ్యం చిత్రంలో వెంకటేష్ చిన్న కుమార్తెగా కనిపించిన ఎస్తేర్ అనిల్, విక్రమ్ సహిదేవ్ లగడపాటి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఈగిల్ ఫేమ్ దావ్‌జాంద్ సంగీతం అందిస్తుండగా, మాయ వి. సినిమాటోగ్రఫర్. 

Tags:    
Advertisement

Similar News