సత్యంసుందరం మూవీపై హీరో నాగార్జున ప్రశంసలు..ఏమన్నారంటే?

‘సత్యం సుందరం’ మూవీపై కింగ్ అక్కినేని నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు.ఈ సినిమాలో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మనిద్దరం నటించిన ‘ఊపిరి’ సినిమాను కూడా గుర్తుచేసుకున్నాని నాగ్ పేర్కొన్నారు.

Advertisement
Update:2024-09-30 11:10 IST

సత్య సుందరం మూవీపై కింగ్ అక్కినేని నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మూవీలో ఎన్నో బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసిందని నాగ్ మెచ్చుకున్నారు.‘‘డియర్ కార్తీ.. నిన్న నైట్ సత్యంసుందరం మూవీ చూశాను!!. నువ్వు, అరవింద్ చాలా బాగా మెప్పించారు. సినిమాలో నిన్ను (కార్తీ) చూసి నవ్వుతూనే ఉన్నాను. అదే చిరునవ్వుతో నిద్రపోయాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మనిద్దరం నటించిన ‘ఊపిరి’ సినిమాను కూడా గుర్తుచేసుకున్నాను.

హృదయాన్ని హత్తుకునేలా ఉన్న మీ చిత్పైరం ప్రేక్షకులు, విమర్శకులు అభినందనలు కురిపిస్తుండడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది!!. మూవీ యూనిట్‌కు మొత్తానికి నా అభినందనలు’’ అని నాగార్జున పేర్కొన్నారు. తమిళ స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ మూవీని 96 మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. జ్యోతిక, సూర్య నిర్మాతలుగా వ్యవహరించారు. చిన్ననాటి ముచ్చట్లు, బాల్యంలో జరిగే సరదాలు..ఇంకా చాలా గుర్తులు మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. 

Tags:    
Advertisement

Similar News