Ramayan | లీగల్ చిక్కుల్లో పడిన రామాయణం?

Ranbir Kapoor's Ramayan - రామాయణ్ సినిమా తాజాగా సెట్స్ పైకి వచ్చింది. అంతలోనే లీగల్ చిక్కుల్లో పడింది.

Advertisement
Update: 2024-05-13 09:11 GMT

రణబీర్ కపూర్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా రామాయణ సినిమా అట్టహాసంగా మొదలైంది. రాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లకి స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఈ సినిమా చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది.

నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కాపీ రైట్ కేసు పడినట్టు తెలుస్తోంది. రామాయణం అనే టైటిల్ వాడకంపై మేథోసంపత్తి హక్కులను అల్లు అరవింద్, మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ కలిసి ఉన్నారు. వీళ్లతో నితీష్ తివారి జరిపిన చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి.

మధు మంతెనకు రాయల్టీ చెల్లించేందుకు రామాయణ్ నిర్మాతలు అంగీకరించారు. అయితే ఆ చెల్లింపు పూర్తి స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై కేసు పడినట్టు సమాచారం. ఈ వార్తకు మరింత బలం చేకురూస్తూ, రామాయణ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఈ ప్రాజెక్టులో హీరో యష్, రావణుడిగా కనిపించబోతున్నాడు. దీనికి అతడు సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

హీరోయిన్ సాయిపల్లవి, హైదరాబాద్ కు వచ్చేసింది. తండేల్ సినిమా షూటింగ్ లో బిజీ అయింది. అటు రణబీర్ కపూర్ అమెరికా వెళ్లిపోయాడు. దీంతో రామాయణ్ ప్రాజెక్టుపై మరిన్ని అనుమనాలు పెరిగాయి. త్వరలోనే ఈ మొత్తం వివాదంపై క్లారిటీ రానుంది.

Tags:    
Advertisement

Similar News