నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట విషాదం

సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Advertisement
Update:2024-10-05 11:13 IST

నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట విషాదం చోటుచేసుకున్నది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రి ఛాతిలొ నొప్పి రావడంతో ఆమె కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు.చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. . గాయత్రి భర్తతో కలిసి.... కేపీహెచ్‌బీలోని వన్ సిటీ అపార్ట్ మెంట్స్ లో నివాసముంటున్నారు. గాయత్రి కూతురు తేజస్విని సాయి మహానటి సహా పలు సినిమాల్లో బాల నటిగా గుర్తింపు పొందింది. కూకట్ పల్లిలోని రాజేంద్రప్రసాద్ నివాసంలో గాయత్రి భౌతిక కాయాన్ని ఉంచారు. గాయత్రి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు.

రాజేంద్ర ప్రసాద్‌ కుమార్తె గాయత్రి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చిన్న వయసులోనే ఆమె అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను అని చంద్రబాబు సంతాపం తెలిపారు.

ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవతుంణ్ణి కోరుకుంటున్నాను.

నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరమని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

Tags:    
Advertisement

Similar News