Allu Sirish | రేట్లు తగ్గించాం.. సినిమాకు రండి

Allu Sirish - అల్లు శిరీష్ తాజా చిత్రం బడ్డీ. ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించారు. అంతా థియేటర్లకు రావాలని కోరుతున్నాడు శిరీష్.

Advertisement
Update: 2024-07-29 08:04 GMT

పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోవడం కామన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్లికేషన్ పెట్టుకోవడం, టికెట్ రేట్ల పెంపుపై ప్రత్యేక జీవో తెచ్చుకోవడం రొటీన్ వ్యవహారంగా మారింది. ఇదే టైమ్ లో పెద్దగా హైప్ లేని చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.

ఈ విషయంలో అల్లు శిరీష్ కాస్త చొరవ తీసుకున్నాడు. తన సినిమాకు టికెట్ రేట్లు తగ్గించాడు ఈ హీరో. సాధారణ టికెట్ రేట్ల కంటే తక్కువ ధరలకే తమ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయమంటున్నాడు అల్లు శిరీష్.

అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధరను 99 రూపాయలుగా నిర్ణయించారు. ఇక మల్టీప్లెక్స్ లో టికెట్ రేటును 125 రూపాయలుగా ఫిక్స్ చేశారు. సాధారణంగా నైజాంలో సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 250 రూపాయలు టికెట్ రేట్లు ఉన్నాయి.

శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు ఉండగా.. దీన్ని 2 గంటల 10 నిమిషాలకు కుదించారు.

Tags:    
Advertisement

Similar News