Aishwarya Rai | అనుమానాలకు తావిచ్చిన ఐశ్వర్య

Aishwarya Rai - అందాల తార ఐశ్వర్య రాయ్ మరోసారి పుకార్లుకు కేంద్ర బిందువైంది. అంబానీ పెళ్లికి ఆమె సెపరేట్ గా హాజరైంది.

Advertisement
Update: 2024-07-14 01:47 GMT

ఐశ్వర్య రాయ్ పై పుకార్లు ఇప్పటివి కావు. కొన్ని నెలల కిందటే ఆమె వ్యక్తిగత జీవితంపై పుకార్లు వచ్చాయి. భర్త అభిషేక్ బచ్చన్ నుంచి ఆమె విడిపోవడానికి సిద్ధంగా ఉందంటూ ప్రచారం జరిగింది. మరోవైపు బచ్చన్ కుటుంబంలో చీలికలు వచ్చాయనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు ఐశ్వర్య-అభిషేక్ దంపతులు. రీసెంట్ గా ఐష్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పిన అభిషేక్, ఆమెతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు. అక్కడితో ఆగిపోయిన పుకార్లు ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి. ఈసారి అనంత్ అంబానీ పెళ్లి వేదికగా మారింది.

అనంత్ అంబానీ పెళ్లికి బచ్చన్ కుటుంబం మొత్తం హాజరైంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్. ఐశ్వర్యరాయ్ వాళ్లతో కలిసి రాలేదు. అమితాబ్, అభిషేక్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులంతా ఫొటోలకు పోజులిచ్చారు. అందులో ఐశ్వర్య లేదు. వాళ్లు లోపలకు వెళ్లిపోయిన చాలాసేపటి తర్వాత ఐశ్వర్యరాయ్ వచ్చింది.

కూతురు ఆరాధ్యతో కలిసి సోలోగా ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో ఐశ్వర్య-అభిషేక్ బంధంపై మరోసారి పుకార్లు గుప్పుమన్నాయి. అత్త జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్ కు మధ్య అభిప్రాయబేధాలున్నాయనే పుకార్లు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. జయా బచ్చన్ ఉన్నచోట ఐశ్వర్య కనిపించడం లేదు.

Tags:    
Advertisement

Similar News