ప్యూర్‌ ఈవీని రెఫర్‌ చేస్తే రూ.4 వేల క్యాష్‌ బ్యాక్‌

పండుగల సందర్భంగా స్పెషల్ ఆఫర్‌ ప్రకటించిన సంస్థ

Advertisement
Update:2025-02-26 16:50 IST

స్నేహితులు, కుటుంబ సభ్యులకు తమ ఈవీని రెఫర్‌ చేస్తే రూ.4 వేల క్యాష్‌ బ్యాక్ ఇస్తామని ప్యూర్‌ ఈవీ సంస్థ ప్రకటించింది. ''ప్యూర్‌ పర్‌ఫెక్ట్‌ 10'' పేరుతో ఈ రిఫరల్‌ ప్రోగ్రాం లాంచ్‌ చేసింది. శివరాత్రి, హోళీ, ఉగాది, రంజాన్‌ పండుగల సందర్భంగా మార్చి 31లోపు లేదా ఔట్‌ లెట్స్‌ లో ఈవీ స్టాక్స్‌ ఉన్నంత వరకు ఈ స్కీం వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ప్యూర్‌ ఈవీ వెహికిల్‌ కొనుగోలు చేసిన వాళ్లు, కొత్తగా వాహన కొన్నవాళ్ల రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్‌ (వాట్సప్‌ నంబర్‌) కు రిఫరల్‌ కోడ్‌ పంపుతారు. ఆ రిఫరల్‌ కోడ్‌ ఉపయోగించి కొత్త ఈవీ కొనుగోలు చేస్తే రూ.4 వేల క్యాష్‌ బ్యాక్ ఓచర్లు ఇస్తారు. పది మంది కష్టమర్లకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ క్యాష్‌ బ్యాక్ ఓచర్లను భవిష్యత్‌లో సర్వీసింగ్‌, స్పేర్‌ పార్ట్స్‌ కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. లేదా నేరుగా క్యాష్‌ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చని సంస్థ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News