తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్

శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. . శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుమల కొండపైకి వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు తెలిపారు.

Advertisement
Update:2024-10-07 08:58 IST

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయిని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల కొండపైకి వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రేపు గరుడ వాహన సేవ ఉంటుంది. దీంతో ఇవాళ్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రైవేట్ ట్యాక్సిలకు ఘాట్ రోడ్డులో నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహానాలకు అనుమతి నిలిపివేస్తున్నారు. అటు రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు, నడకమార్గం తెరిచి వుంచనున్నారు టిటిడి అధికారులు.

Tags:    
Advertisement

Similar News