ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు

Advertisement
Update:2024-10-20 14:25 IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్‌ , కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటిరాజేంద్రప్రసాద్‌పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News