Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    మోసం, దగా, కుట్ర.. జగన్ ట్వీట్

    By Telugu GlobalAugust 10, 20242 Mins Read
    మోసం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇచ్చిన హామీలనుంచి తప్పించుకోవడం పచ్చి మోసం కాదా..?

    రెండున్నర నెలల్లోనే ప్రజల్ని ఇంత దగా చేస్తారా..?

    రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలు, కుట్రలు..

    దిగజారిన పాలనను ఇకనైనా గాడిలో పెట్టండి చంద్రబాబూ..! అంటూ ఓ సుదీర్ఘ ట్వీట్ వేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్.

    ఇటీవల పదే పదే ఖజానా ఖాళీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్న డైలాగుల్ని గుర్తు చేస్తూ జగన్ సూటిగా ఆయన్ను నిలదీశారు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర బాధ్యత తనదేనని చెప్పిన బాబు, ఎన్నికల తర్వాత బాధ్యత ప్రజలదేనంటూ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణంనుంచే సీఎం ప్లేటు ఫిరాయించారన్నారు. ఖజానా ఖాళీ అంటూ తప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. అప్పులకు వడ్డీలుకట్టడానికే డబ్బుల్లేవంటున్న చంద్రబాబు లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు జగన్.

    .@ncbn … ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి…

    — YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2024

    తల్లికి వందనం రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చేయలేదు, వసతి దీవెన, సున్నావడ్డీ, మత్స్యకార భరోసా అడ్రస్సే లేవన్నారు జగన్. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానన్న మాట కూడాచంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. ఇంటికి వచ్చే రేషన్‌ నిలిచిపోయిందని, వాలంటీర్లను మోసం చేశారని, విత్తనాలకోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితిని తీసుకు వచ్చారని మండిపడ్డారు. పంటలకు ఉచిత బీమా ఎగరగొట్టారని, బడుల్లో టోఫెల్‌ పీరియడ్‌ రద్దుచేశారన్నారు.

    లా అండర్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడితప్పిందని, ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యమేలుతోందని అన్నారు జగన్. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోందని ఎద్దేవా చేశారు. మహిళలకు రక్షణ లేదని, దిశయాప్‌ అటకెక్కిందని, రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగాచేస్తారా చంద్రబాబూ? అని ప్రశ్నించారు జగన్. సాక్షాత్తూ గవర్నర్‌తో అసెంబ్లీలో అనేక అవాస్తవాలను చెప్పించారని అన్నారు. జూన్‌ 2024నాటికి ఏపీ ఉన్న మొత్తం అప్పు అక్షరాల రూ.7,48,612కోట్లు మాత్రమేనని ఇందులో 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.4,08,170 కోట్లు అని వివరించారు. ఆర్బీఐ నివేదికలు, కాగ్‌ లెక్కల్లాంటి ఆధారాలతో కూడిన సమగ్ర వివరాలు ఈ లింక్‌ https://bit.ly/4dkOKru లో ఉన్నాని, చంద్రబాబు వాటిని జాగ్రత్తగా చదువుకోవాలని సూచించారు. ఇప్పటికైనా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. 

    ap politics YSRCP
    Previous Articleపాక్ స్వర్ణవిజేతకు 3 లక్షలు- భారత రజత విజేతకు 50 లక్షలు!
    Next Article Good Bad Ugly | అజిత్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.