Telugu Global
Telangana

అసెంబ్లీలో కులగణన సర్వే నివేదిక ప్రవేశపెట్టిన సీఎం

కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ

అసెంబ్లీలో కులగణన సర్వే నివేదిక ప్రవేశపెట్టిన సీఎం
X

సామాజిక, ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉయభ సభలు ఇవాళ సమావేశమయ్యాయి. కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై శాసనసభలో చర్చ జరుగుతున్నది. అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 మంది (17.34 శాతం) ఉన్నారు. బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా) 1,64,09,179 మంది (46.25 శాతం) ఉన్నారు. ఎస్టీలు 37,05,929 మంది (10.45 శాతం) ఉన్నారు. ముస్లిం మైనారిటీలు 44,57,012 మంది ( 12.56 శాతం) ఉన్నారు. ముస్లిం మైనారిటీల్లో బీసీలు 35,76,588 మంది (10.08 శాతం) ఉన్నారు. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 మంది (2.48 శాతం) ఉండగా.. ఓసీలు 56,01,539 మంది ( 15.79 శాతం) ఉన్నారని సీఎం వెల్లడించారు.

కుల గణన సర్వే నివేదికపై అసెంబ్లీలో సీఎం ప్రసంగ పాఠం



First Published:  4 Feb 2025 3:02 PM IST
Next Story