Twitter

ట్విట్టర్ ను స్వంతం చేసుకున్న ప్ర‌పంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆ సంస్థ ఉద్యోగుల శ్రమను దోచుకోవడం మొదలుపెట్టారు. రోజుకు 12 గంటలు వారానికి 7 రోజులు పని చేయాలని లేదంటే ఉద్యోగాల నుండి తొలగిస్తానని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

మోడీ సర్కార్ ట్విట్టర్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అందులో తన ఏజెంట్ ను నియమించుకుందని ఆ సంస్థ మాజీ సెక్యూరిటీ ఛీఫ్ బైటపెట్టారు. అతని ద్వారా ట్విట్టర్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసే వినియోగదారుల డేటాను మోడీ సర్కార్ సంపాదించిందని ఆయన ఆరోపించారు.

ఎలాన్ మస్క్, ట్వీటర్ ల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ట్విటర్ ను కొంటానని ఒప్పందం చేసుకొని దాన్ని తిరస్కరించిన తర్వాత ఎలాన్ మాస్క్ పై ట్విటర్ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో ట్వీటర్ ఫేక్ అకౌంట్లపై చర్చకు రావాలని ఆసంస్థ సీఈఓ కు ఎలాన్ మస్క్ సవాల్ విసిరాడు.