అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని వైసీపీ నిలదీస్తోంది. టీడీపీ ఇదేం పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ఏకైక సమస్య దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మేటర్ అన్నట్టుగా ట్వీట్లు వేస్తోంది.
TDP
ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తు చేశారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
మద్యపాన నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు, సన్నబియ్యం పంపిణీ.. ఇలా జగన్ ఫిరాయించిన ప్లేట్లు 999 ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు.
జగన్ ని ఉద్దేశపూర్వకంగానే ఇరుకున పెట్టాలని ఇరువర్గాలు భావించడం ఇక్కడ విశేషం. అటు టీడీపీ, ఇటు షర్మిల ఓ ప్లాన్ ప్రకారమే జగన్ పేరు ప్రస్తావించారని, వైసీపీని విమర్శించారని తెలుస్తోంది.
గతంలో ఎలాంటి సెక్యూరిటీ ఉందో, అదే సెక్యూరిటీ కావాలంటున్నారు జగన్. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా సీఎం స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం ఎలా సాధ్యమని టీడీపీ ప్రశ్నిస్తోంది.
వైసీపీకి చెందిన స్థానిక సంస్థల నేతలు నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
సంక్షేమ పథకాలకోసం బటన్ నొక్కి రూ.2.71 లక్షలు పంపిణీ చేస్తే, రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందని ప్రశ్నించారు చంద్రబాబు.
జగన్ ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారు, చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారు. శాంతి భద్రతల విషయంలో రెండు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు విజయసాయిరెడ్డి. అఖిలపక్ష సమావేశంలో ఆ విషయం మరోసారి రుజువైందన్నారు.
రాష్ట్రంలో ప్రతిరోజు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వంలో ఉండి కళ్లున్నా చూడలేని కబోదుల్లా టీడీపీ నేతలు మారారని వైసీపీ అంటోంది.