Diabetes

డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సరైన ఆహారం తీసుకుంటూ, మందులు వేసుకోవడం వల్ల దాన్ని నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉన్నది.

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. సరైన లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌తో మాత్రమే దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలం. డయాబెటిస్ పేషెంట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

రక్తంలో చక్కెర స్థాయులను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు డాక్టర్ నికోలస్ కిర్క్, ప్రొఫెసర్ మైక్ లారెన్స్ కనుగొన్నారు. రక్తంలో గ్లూకోజ్ తీసుకునే ప్రక్రియను ప్రేరేపించే మాలిక్యుల్‌ను ఈ పరిశోధనలో వారు గుర్తించారు.

టైప్-1, టైప్-2 డయాబెటిస్ కారణంగా చాలా మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. డయాబెటిస్ ద్వారా కిడ్నీలు పాడయిన వారికి.. డయాలసిస్ చేసినా తాత్కాలిక ఉపశమనమే కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

చలికాలంలో నమోదయ్యే తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లలో షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

ఉల్లిపాయల్లో రక్తంలో చెక్కర పెరుగుదలని నియంత్రించే అంశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడిసినల్ ఫుడ్ అనే జర్నల్ లో ఈ విషయాలు ప్రచురించారు.

మనదేశంలో గుండె సమస్యలకు ముఖ్యంగా ధూమపానమే కారణమట. అలాగే బీపీ, డయాబెటిస్‌కు ఒబెసిటీ, వ్యాయామం లేకపోవడం, లైఫ్‌స్టైల్ మార్పులు కారణమని తేలింది. దేశంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటు బారినపడ్డారు

ఆహారపు అలవాట్లు, ప్రజల జీవన శైలి మార్పుతో 60, 70 ఏళ్ల వయసులో రావాల్సిన రోగాలన్నీ ముందుగానే చుట్టుముడుతున్నాయి. 40 ఏళ్లకే బీపీ, షుగర్.. 50 దాటితే వృద్ధాప్యం.. ఇదీ నేటి పరిస్థితి. అందుకే రాజకీయ పార్టీలు కూడా 50 దాటితే వృద్ధాప్యపు పింఛన్ ఇస్తామంటూ ప్రజలకు ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే షుగర్, బీపీ వంటి వాటిని ముందస్తుగా గుర్తించి వైద్యం మొదలు పెడితే.. వాటి వల్ల వచ్చే ముప్పుని వాయిదా వేసుకోవచ్చని చెబుతుంటారు వైద్య నిపుణులు. […]