సరోగసి విధానంలో బిడ్డను పొందడానికి అవివాహితలు, ఒంటరి మహిళలు ఎందుకు అర్హులు కారు? అంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చట్టబద్ధంగా సరోగసీ ద్వారా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఒంటరి, అవివాహిత స్త్రీలకు ఎందుకు లేదో సమాధానం చెప్పాలని కోర్టు కేంద్రాన్ని కోరింది.