BCCI

ఈ సీజన్‌లో అయ్యర్ కంటే ముందు శుభ్‌మన్‌గిల్, రిషబ్‌పంత్, సంజూ శాంసన్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. కాగా, రాజస్థాన్ చేతిలో 2 వికెట్ల తేడాతో కోల్‌కతా ఓడిపోయింది.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. 2024 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను బోర్డు కార్యదర్శి జే షా విడుదల చేశారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొంటూ దూసుకుపోతోంది. చరస్థిర ఆస్తులు, ఆదాయం, సంక్షేమం, వితరణలో ప్రపంచంలోనే మేటిగా నిలిచిన క్రికెట్ బోర్డుగా చరిత్ర సృష్టించింది.

భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా కొనసాగాలని మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ వేడుకొంటోంది. మరో ఏడాది పాటు బాధ్యతలు నిర్వర్తించాలని అభ్యర్థిస్తోంది.

భారత క్రికెటర్లు ప్రపంచ క్రికెట్లోనే భాగ్యవంతులు. ఏడాదిపొడగునా క్రికెట్ ఆడుతూ రెండుచేతులా ఆర్జిస్తున్న మొనగాళ్లు. అయితే..రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత ఆటగాళ్లు సైతం శ్రమదోపిడీకి గురవుతున్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేని ప్రయివేటు ఉద్యోగుల జాబితాలో చేరిపోయారు. భారత క్రికెట్ నియంత్రణమండలి చేతిలో బంగారు బాతులుగా మారిపోయారు…… అహరహం శ్రమిస్తూ….పగలనకా రాత్రనకా క్రికెట్ ఆడేస్తూ…భారత క్రికెట్ నియంత్రణమండలిపాలిట బంగారుబాతులుగా మారిన టీమిండియా క్రికెటర్లు తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదంటూ వాపోతున్నారు. ప్రయివేటురంగ ఉద్యోగులమాదిరిగా శ్రమదోపిడీకి గురయ్యామంటూ […]

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాలలో చేరటం కోసం బీసీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా వచ్చిన వార్త నిజం కాదని, కేవలం మీడియావర్గాల ఊహాగానమేనని తేలిపోయింది. కేవలం క్రికెట్ తోనే తన జీవితంలో మూడుదశాబ్లాల కాలం ముగిసిపోయిందంటూ దాదా ఓ చిత్రమైన ట్విట్ చేయడం గందరగోళానికి దారితీసింది. 1992 నుంచి 2022 వరకూ… 1992లో తన క్రికెట్ జీవితం ప్రారంభించిన సౌరవ్ గంగూలీ ప్రస్తుత 2022తో మూడుదశాబ్దాల కెరియర్ ను పూర్తి చేసుకొన్నాడు. బెంగాల్ […]