ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన SIPB అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ద్వారా కాలుష్య రహిత ఇంధన వినియోగంతోపాటు, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు అధికారులు. భూములిచ్చే రైతులకు ఏడాదికి […]
AP
ప్రభుత్వాలు, కోర్టుల వద్ద కొన్ని అంశాలు పెండింగ్లో పడిపోతే ఇక అవి పరిష్కారం అవడం దైవాదీనమే. 1998 డీఎస్సీ వివాదం కూడా అలాంటిదే. దాదాపు 23 ఏళ్లు పెండింగ్లో ఉండిపోయింది. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు దశాబ్దాలుగా పోరాటం చేసి చివరకు ఆశలు వదిలేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం సమస్యను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిష్కరించారు. 1998 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తూ, వారికి ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం జగన్ ఫైల్పై సంతకం […]
ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాలను పూర్తిగా ఆన్ లైన్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమైంది. జులై-2 ఎంఓయూ కుదుర్చుకోడానికి ఆఖరు తేదీ. అయితే ఈ ఎంఓయూలో పొందుపరిచిన నియమనిబంధనలు చూసి ఎగ్జిబిటర్లు షాకవుతున్నారు. ఇది ఏమాత్రం తమకు గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఎంఓయూకి ససేమిరా అంటున్నారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే థియేటర్ల లైసెన్స్ లు రద్దు చేస్తామంటూ పరోక్ష హెచ్చరికలు చేస్తున్నా యాజమాన్యాలు మెట్టు దిగడంలేదు. ఎందుకీ ఒప్పందం..? ఏపీలో సినిమా టికెట్ […]
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో పాస్ పర్సంటేజీ మరీ తక్కువగా ఉండటంతో.. ఫెయిలైన విద్యార్థులకోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తోంది ప్రభుత్వం. వారికి కంపార్ట్ మెంటల్ గ్రేడ్ ఇవ్వబోమని భరోసా ఇచ్చింది. అదే సమయంలో మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులకు బెటర్మెంట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించాలని పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కండిషన్స్ అప్లై.. బెటర్మెంట్ అంటున్నారు కానీ ఇక్కడ కండిషన్లు చాలానే […]
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ కానుక ఇవ్వబోతున్నారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల డిక్లరేషన్ ఫైలుపై ముఖ్యమంత్రి గురువారం సంతకం చేశారు. దీంతో వీరికి కొత్త జీతాలు అందనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత డిపార్ట్మెంటల్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులు అయితే వారికి కొత్త వేతనాలు అందుతాయి. ఈ క్రమంలో ఇటీవల గ్రామ, వార్డు […]
పంట బీమా పరిహారం చెల్లింపుపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. కథనాలు రాసిన విధానం చూస్తుంటే రాసిన వారికి సరైన శిక్షణ కల్పించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. లబ్దిదారులు 30 లక్షల మంది ఉంటే పరిహారం 15 లక్షల మందికి ఇచ్చారని రాయడం బట్టే వారి అవగాహన ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. ఎల్లో మీడియా తీరుచూస్తుంటే మొత్తం రైతులంతా నష్టపోవాలని కోరుకుంటున్నట్టుగా ఉందన్నారు. 31 పంటలకు 30 […]
ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వాలకు, అక్కడి గవర్నర్లకు మధ్య పొసగకపోవడం, ఒకరి విధానాలు మరొకరికి నచ్చకపోవడంతో సయోధ్య కొరవడి వివాదాలు తలెత్తుతుండడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు ప్రాంతానికి వచ్చిన మహిళా గవర్నర్లు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుముద్ బెన్ జోషి గవర్నర్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చిన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు 2019 `సెప్టెంబర్ లో నియమితులైన తమిళి సై సౌందరరాజన్ ప్రస్తుతం గవర్నర్ గా కొనసాగుతున్నారు. తొలినాళ్ళలో […]
పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఆయన్ను కామెంట్ చేయడం వైసీపీ నేతలకు ఓ సరదా. గతంలో పేర్ని నాని, బొత్స.. పలు సందర్భాల్లో పవన్ ని ఇదే విషయంలో కామెంట్ చేశారు, కార్నర్ చేశారు. ఆ తర్వాత పవన్ నొచ్చుకోవడంతో అలాంటి సెటైర్లు కాస్త తగ్గాయి. తాజాగా మంత్రి గుడివాడ అమర్ నాథ్.. మరోసారి పవన్ పై అలాంటి కామెంట్లు చేశారు. ఆయనకు ఏవైనా మూడు ఉండాలని, అందుకే మూడు ఆప్షన్ లు ఇచ్చారని అన్నారు. […]
సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. మోసం చేయడంలో బాబు, ఆయన దత్త పుత్రుడు ఇద్దరూ తోడుదొంగలంటూ మండిపడ్డారు. అసలు వారిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని ప్రశ్నించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇచ్చామని చెప్పారు. పరిహారం అందని ఒక్క కుటుంబాన్నయినా చూపాలంటూ దత్త పుత్రుడికి సవాల్ విసిరితే పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ పరిహారం అందని […]
కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోయినా కింద మీద పడైనా సరే రైతులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు సీఎం వైఎస్ జగన్. రైతుల పంట బీమా పరిహారం 2,977 కోట్ల రూపాయలను సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతుల ఖాతాలోకి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. అక్కడే బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్.. రైతులకు ఒకవైపు ప్రభుత్వం మంచి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. కోనసీమలో క్రాప్ హాలీడే అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. […]