ఆడుదాం ఆంధ్రా విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈ అవినీతికి మాజీ మంత్రి రోజాని బాధ్యురాలిగా చేసే అవకాశాలున్నాయి. పక్కా ఆధారాలతో తమ ఆరోపణలను నిరూపించి రోజాపై విచారణ చేపట్టే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ap politics
అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని వైసీపీ నిలదీస్తోంది. టీడీపీ ఇదేం పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ఏకైక సమస్య దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మేటర్ అన్నట్టుగా ట్వీట్లు వేస్తోంది.
అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత సంఘాలతో పాటు వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
అప్పులకు వడ్డీలుకట్టడానికే డబ్బుల్లేవంటున్న చంద్రబాబు.. లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు జగన్.
జూన్ 3వ తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరారు జగన్. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని కోర్టుకి తెలిపారు.
ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, మిగతా అందరికీ ఈ రెండు నెలలు ఒకటో తేదీనే జీతాలు బ్యాంకుల్లో జమ అయ్యాయి. టీడీపీ నేతలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారు.
దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అని అన్నారు చంద్రబాబు. రామచంద్రరావు కమిటీ వేసి, ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణను తానే తీసుకొచ్చానని గుర్తు చేశారు.
నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు సీఎం చంద్రబాబు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలు పెడతామన్నారు.
శ్వేత పత్రాల్లో విషయమేమీ లేదని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. హామీలు అమలు చేయకుండా తప్పించుకోడానికి టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు.
మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి మానవాళికి రక్షణ కవచంగా ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్. మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.