Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ఛానెల్స్ అన్నీ.. రెండురోజులుగా చంద్రబాబు ఉంగరం గురించి కథనాలు వండి వార్చాయి. చంద్రబాబు కొత్త ఉంగరం పెట్టుకున్నారు, అది హైటెక్ ఉంగరం, దానిలో ఉన్న సుగుణాలు చూడండి అంటూ ఊదరగొట్టాయి. అసలు చంద్రబాబు ఏ ఉంగరం పెట్టుకుంటే జనాలకి ఉపయోగం ఏంటి..? ఆయన ఉంగరం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి..? ఇక్కడ మీడియాని తప్పుబట్టలేం, బాబు ప్రమోషన్ మైండ్ గేమ్ ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈమధ్య కాలంలో చంద్రబాబు వార్తలంటే ఆ మూడు […]

మహానాడు ఘనంగా జరిగింది, మినీ మహానాడులు అంతకంటే బాగా జరుగుతున్నాయని చెబుతున్నారు చంద్రబాబు. కానీ కొన్నిచోట్ల మాత్రం ఆయనకు తలనొప్పులు తప్పడంలేదు. అసలే నాయకులు లేరు, 2024లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఉందని బాబు బాధపడుతుంటే.. ఉన్న నాయకుల్లో కూడా సఖ్యత లేకపోవడం మరో విశేషం. తాజాగా అన్నమయ్య జిల్లా కలికిరిలోని పుంగనూరులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. అధినేత చంద్రబాబు ముందే తెలుగు తమ్ముళ్లు కుమ్ములాట మొదలు పెట్టారు. మాది క్రమశిక్షణ […]

వైసీపీ ప్లీనరీకి సీఎం జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవుతుండటంతో.. భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ అధికారులు. ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కోసం 25 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతిరాణా టాటా పర్యవేక్షించారు. రెండు రోజులపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్లీనరీ మొత్తం సీసీ‌ కెమెరాల పర్యవేక్షణలో […]

నిరుపేద మైనార్టీలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2015 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మైనార్టీల వివాహాలకు ప్రభుత్వం 50 వేల రూపాయల సహాయం చేసేది. అయితే ఎన్నికల సమయంలో దుల్హన్ పథకాన్ని కొనసాగించడమే కాక 50 వేలకు బదులు లక్షరూపాయలు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆ పథ‌కాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న […]

వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటినుంచి రెండురోజులపాటు ప్లీనరీ జరుగుతుంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందస్తుగా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్లీనరీలు జరిగాయి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ప్లీనరీలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్రస్థాయి సమావేశానికి నేతలు సిద్ధమయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నేతలు. ఇటీవలే టీడీపీ మహానాడు […]

హైదరాబాద్ శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు ప‌టాన్‌చెర్వు ప్రాంతంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప‌టాన్‌చెర్వు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కోడి పందాలు జరుగుతున్న ప్రాంతంలో దాడులు చేశారు. నిర్వాహకులతో పాటు 70 మంది అక్కడ కోడి పందాల్లో పాల్గొని పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, దాడి చేసే సమయానికి 70 మందిలో 49 మంది […]

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే టీడీపీ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరి స్పష్టంగా ప్రకటించలేదు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తారా, లేక ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తారా అనేది బయటపెట్టలేదు. అయితే ఈ ముసుగులో గుద్దులాట దేనికంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాజ్యాంగపరమైన పదవుల విషయంలో ఏకాభిప్రాయం ఉండాలన్నది తమ విధానం అని.. అందుకే […]

ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ పై దాడి కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు, అతని కుమారుడు భరత్ సహా మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అయితే ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు.. ముఖ్యంగా సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర.. ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం […]

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ టార్గెట్. అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్న లక్ష్యం కాదు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతోంది. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటలా మారిపోయిన కుప్పం నియోజకవర్గంలో.. లక్షకు తగ్గని మెజారిటీతో ఆయన గెలుస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఆ మెజార్టీని 30 వేల ఓట్లకు తగ్గించడంలో వైసీపీ విజయవంతం అయ్యింది. ఇక రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి బాబును పంపేయడమే లక్ష్యంగా […]

ప్లీనరీ సమావేశాలు అంటే కేవలం పార్టీ నాయకులు మాత్రమే ఉంటారనుకుంటున్నారో, లేక ఈలలు, చప్పట్లతో కాస్త ఉత్సాహం ఎక్కువై మనసులో మాట బయటపెడుతున్నారో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు వలంటీర్లపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వలంటీర్లు కొంతమంది తమ మాట వినడంలేదంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేసిన […]