Sports

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు అమెరికా, కరీబియన్ ద్వీపాల గడ్డపై కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ నెల 29 వరకూ జరిగే 55 మ్యాచ్ ల ఈ మహాసమరంలో భారత్ తో సహా 20 దేశాలజట్లు ఢీ కొనబోతున్నాయి.

ఐపీఎల్ -16వ సీజన్ మ్యాచ్ లను జియో సినిమా వేదికగా 449 మిలియన్ల మంది ప్రత్యక్షప్రసారాల ద్వారా వీక్షించారు. వీక్షకులు సంఖ్య 44 కోట్ల 90 లక్షల నుంచి 62 కోట్లకు చేరడం ద్వారా సరికొత్త రికార్డు నమోదయ్యింది.

భారతక్రికెట్ ప్రధాన శిక్షకుడి పదవి రేస్ లో గౌతం గంభీర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐతో గంభీర్ చర్చలు దాదాపు ముగింపుదశకు చేరినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది. ఇక కోచ్‌ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఇష్టపడకపోవడంతో కొత్త కోచ్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టింది బీసీసీఐ.

క్టే కోర్ట్‌ను గ‌త 20 ఏళ్లుగా క‌నుసైగ‌తో శాసిస్తున్న నాద‌ల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం ప‌ట్ట‌డం విషాదం.